టూరిస్టులకు గుడ్ న్యూస్ :TGSRTC స్పెషల్ ప్యాకేజీ.. కుక్కి.. ఉడిపి.. మురుడేశ్వర్.. గోవా టూర్

టూరిస్టులకు గుడ్ న్యూస్ :TGSRTC స్పెషల్ ప్యాకేజీ.. కుక్కి.. ఉడిపి.. మురుడేశ్వర్.. గోవా టూర్
  •     ఆర్టీసీ 5 రోజుల స్పెషల్​ ప్యాకేజీ ..   ఒక్కొక్కరికి రూ.5,130

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరం నుంచి ముఖ్యమైన కొన్ని క్ష్రేత్రాల సందర్శనతో పాటు గోవా టూర్​ను పొందుపరిచి స్పెషల్​ప్యాకేజీని తీసుకువచ్చింది ఆర్టీసీ. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే ఈ టూర్​ మార్చి1 వరకు కొనసాగనున్నది. 25  న బీహెచ్ఈఎల్​డిపో నుంచి రాజధాని ఏసీ బస్సు బయలుదేరుతుంది. 26న  కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, 27న ఉడిపి, మురుదేశ్వర్​, రెండు రోజులు గోవా టూర్​అంటే 1వ తేదీ వరకు గోవాలో బీచ్​లు ఇతర టూరిస్ట్​ ప్లేస్​ల విజిట్​ఉంటుంది. తిరుగు ప్రయాణం మార్చి1 ఉదయం 6 గంటలకు ఉంటుంది. ఒక్కొక్కిరికి  రూ 5,130 చార్జ్​ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్​లైన్​లో www.tgsrtcbus.in ద్వారా బుక్ చేసుకోవచ్చని బీహెచ్ఈఎల్​ డిపో మేనేజర్​ తెలిపారు.